nithin: 'భీష్మ' షూటింగుకి ముహూర్తం ఖరారు

  • 'ఛలో' తో హిట్ కొట్టిన వెంకీ కుడుముల
  • నితిన్ హీరోగా తదుపరి సినిమా
  • ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్  

వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన 'ఛలో' .. యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. దాంతో ఆయన మరో ప్రేమకథను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సారి నాయకా నాయికలుగా ఆయన నితిన్ .. రష్మికలను ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమాకి 'భీష్మ' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది. ఈ నెల 25వ తేదీన రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. సితార బ్యానర్ పై ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు. కొంతకాలంగా నితిన్ సక్సెస్ అనే మాటను వినలేదు. అందువలన సాధ్యమైనంత త్వరగా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఈ సినిమాతో అయినా ఆయన ఆశ నెరవేరుతుందేమో చూడాలి. 

More Telugu News