PV Sindhu: చైనాకు చెందిన సంస్థతో రూ.50 కోట్ల విలువైన ఒప్పందం చేసుకున్న పీవీ సింధు

  • లీ నింగ్ అనే స్పోర్ట్స్ బ్రాండ్‌తో కుదిరిన ఒప్పందం
  • స్వయంగా వెల్లడించిన మహేంద్ర కపూర్
  • నాలుగేళ్ల పాటు కొనసాగనున్న ఒప్పందం

గతంలో బ్యాడ్మింటన్ సంచలనం కిడాంబి శ్రీకాంత్‌తో రూ.35 కోట్ల విలువైన ఒప్పందం చేసుకున్న చైనాకు చెందిన ఓ సంస్థ తాజాగా రియో ఒలింపిక్స్ రజత పతాక విజేత పీవీ సింధుతో భారీ డీల్ కుదుర్చుకుంది. లీ నింగ్ అనే స్పోర్ట్స్ బ్రాండ్‌.. సింధుతో దాదాపు రూ.50 కోట్ల విలువైన ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని సన్‌లైన్ స్పోర్ట్స్ సంస్థ డైరెక్టర్, లీ నింగ్ పార్టనర్ మహేంద్ర కపూర్ స్వయంగా వెల్లడించారు.

‘‘సింధుతో మరోసారి ఒప్పందం చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది. రూ.50 కోట్ల విలువైన ఈ ఒప్పందం నాలుగేళ్ల పాటు కొనసాగనంది. ఇందులో రూ.40 కోట్లు సింధుకి స్పాన్సర్‌షిప్‌గా అందజేస్తాం. మిగిలిన రూ.10 కోట్లతో ఆమెకు అవసరమైన పరికరాలు అందజేస్తాం’’ అని మహేంద్ర పేర్కొన్నారు. ఈ సంస్థతో ఒప్పందం పట్ల సింధు కూడా సంతోషం వ్యక్తం చేసింది.

More Telugu News