Andhra Pradesh: ఢిల్లీలో చంద్రబాబు దీక్ష.. రెండు ప్రత్యేక రైళ్ల ఏర్పాటు!

  • శ్రీకాకుళం, అనంతపురం నుంచి సర్వీసులు
  • ఢిల్లీలో దీక్షకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్న శ్రేణులు
  • బీజేపీయేతర పక్షాలు మద్దతు తెలిపే ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యానికి నిరసనగా ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 11న ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లను పూర్తిచేస్తున్నాయి. ఈ దీక్షలో పాల్గొనేందుకు రెండు రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వేకు రూ.1.12 కోట్లు చెల్లించామని వెల్లడించారు.

వీటిలో ఓ రైలు శ్రీకాకుళం నుంచి, మరో రైలు అనంతపురం నుంచి బయలుదేరుతాయని పేర్కొన్నారు. చంద్రబాబు దీక్షకు మద్దతు తెలపాలనుకునేవారు ఈ రైళ్లలో రావొచ్చన్నారు. కాగా, ఈ దీక్ష కోసం భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు ఢిల్లీకి తరలి వెళ్లనున్నాయి. మరోవైపు చంద్రబాబు దీక్షకు బీజేపీయేతర నేతలు హాజరై మద్దతు తెలిపే అవకాశముందని భావిస్తున్నారు.

More Telugu News