Rahul Gandhi: పార్టీ ముఖ్య నాయకులతో రాహుల్‌ ఢిల్లీలో సమావేశం

  • హాజరైన పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు
  • రానున్న ఎన్నికల్లో వ్యూహాలపై కసరత్తు
  • హాజరైన ఉత్తమకుమార్‌, భట్టి, రఘువీరా

సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యూహాలకు పదును పెట్టడం మొదలు పెట్టారు. ఈరోజు ఢిల్లీలో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపించే విషయమై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాగా, సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క, రఘువీరారెడ్డిలు హాజరయ్యారు.

More Telugu News