Andhra Pradesh: టీడీపీలో ఓ కొలిక్కి వచ్చిన జమ్మలమడుగు వివాదం!

  • ఎమ్మెల్సీ పదవికి రామసుబ్బారెడ్డి రాజీనామా
  • సీఎం చంద్రబాబుకు లేఖ సమర్పించిన నేత
  • ఆదినారాయణరెడ్డి కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ  

ఏపీ టీడీపీలో కొనసాగుతున్న జమ్మలమడుగు వివాదం ఓ కొలిక్కి వచ్చింది. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డిల మధ్య సయోధ్య కుదిరింది. ఆదినారాయణరెడ్డి సోదరులకు తన ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు రామసుబ్బారెడ్డి అంగీకరించారు. అందుకు బదులుగా, రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో రామసుబ్బారెడ్డి తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకు అందజేశారు. కడప ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News