Telangana: మహిళపై అత్యాచారం చేసి హతమార్చిన దుండగులు!

  • కరీంనగర్ లోని అపోలో వద్ద ఘటన
  • కేసు నమోదు చేసిన పోలీసులు
  • నిందితుల కోసం గాలింపు ముమ్మరం

తెలంగాణలోని కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి అపోలో ఆసుపత్రి పక్కనున్న పాల దుకాణం షెడ్ లో కొందరు దుండగులు ఓ గుర్తుతెలియని మహిళను కిరాతకంగా హత్య చేశారు. ఈరోజు ఉదయం షెడ్ లో నిర్జీవంగా పడిఉన్న మహిళను గుర్తించిన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు.

దీంతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. బాధితురాలిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు భావిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.

More Telugu News