Dwakra Women: జనవరి 18కి ముందు ఏర్పడిన ఏపీ డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్

  • 4.37 లక్షల మందికి చెక్కులు
  • బ్యాంకులకు రూ.2,350 కోట్లు
  • రూ.1,093 కోట్లు విత్ డ్రా

పసుపు-కుంకుమ పథకం కింద ఇప్పటికే డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా కొత్తగా ఏర్పడిన డ్వాక్రా సంఘాలకు కూడా శుభవార్తను అందించింది. సోమవారం నుంచి కొత్తగా మరో 4.37 లక్షల మందికి పసుపు-కుంకుమ కింద చెక్కులు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. జనవరి 18కి ముందు ఏర్పడిన డ్వాక్రా సంఘాలన్నింటికీ చెక్కులు అందజేయనుంది. ఈ పథకం కింద మొదటి విడతగా రూ.2,350 కోట్లను వివిధ బ్యాంకులకు పంపించగా.. ఇప్పటి వరకూ రూ.1,093 కోట్ల నిధులను డ్వాక్రా మహిళలు డ్రా చేసుకున్నారు.

More Telugu News