Mahesh Babu: డబ్బింగ్ పనులు మొదలెట్టేసిన 'మహర్షి'

  • ముగింపు దశలో 'మహర్షి'
  • మహేశ్ కెరియర్లో ప్రత్యేకం
  •  ఏప్రిల్ 25వ తేదీన విడుదల

మహేశ్ 25వ సినిమాగా 'మహర్షి' రూపొందుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. షూటింగ్ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకోవడంతో, ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులను మొదలెట్టేశారు. ఇక ఇప్పటి నుంచి డబ్బింగ్ పనులు వేగంగా జరగనున్నాయి. త్వరలో మహేశ్ బాబు కూడా తన పాత్రకి డబ్బింగ్ ను పూర్తి చేస్తాడు.

బలమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన కథానాయికగా పూజా హెగ్డే .. ఆయన ప్రాణ స్నేహితుడిగా అల్లరి నరేశ్ కనిపించనున్నారు. అశ్వనీదత్ .. దిల్ రాజు .. పీవీపీ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను, ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నారు. 'భరత్ అనే నేను' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేశ్ చేస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలే వున్నాయి.

More Telugu News