new zealand: భారత బౌలర్లకు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. భారీ స్కోరు

  • 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసిన న్యూజిలాండ్
  • 43 బంతుల్లో 84 పరుగులు చేసిన సీఫ్రెట్
  • సత్తా చాటిన మన్రో, విలియంసన్, టేలర్

న్యూజిలాండ్ తో వెల్లింగ్టన్ లో జరుగుతున్న తొలి టీ20లో ఆతిథ్య జట్టు భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. తద్వారా భారత్ ముందు 220 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.

అంతకు ముందు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కివీస్ ఓపెనర్లు సీఫ్రెట్, మన్రోలు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. సీఫ్రెట్ 43 బంతుల్లో 84 పరుగులు (7 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసి విశ్వరూపం ప్రదర్శించాడు. మన్రో 20 బంతుల్లో 34 పరుగులు చేశాడు. వీదిద్దరూ 86 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మన్రోను ఔట్ చేసి కీలక భాగస్వామ్యానికి హార్దిక్ పాండ్యా తెరదించాడు. అనంతరం అహ్మద్ బౌలింగ్ లో సీఫ్రెట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఈ పరిస్థితుల్లో కూడా కివీస్ జోరు తగ్గలేదు. ఆ తర్వాత విలియం సన్ కూడా 22 బంతుల్లో 34 పరుగులు (3 సిక్సర్లు) చేసి స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో మిచెల్ 8, టేలర్ 23, గ్రాండ్ హోమ్ 3 పరుగులు చేశారు. శాంట్నర్ 7 పరుగులు, కుగ్లీన్ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా... భువనేశ్వర్, కేకే అహ్మద్, కృణాల్ పాండ్యా, చాహల్ లు చెరో వికెట్ తీశారు.

More Telugu News