kolkata: మోదీని గద్దె దింపి గుజరాత్ కు పంపించడం ఖాయం: ధర్నా విరమించిన మమతా బెనర్జీ

షార్ట్స్‌లో చూడండి
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ‘సేవ్ ఇండియా’ నినాదంతో చేపట్టిన ధర్నాను విరమించారు. కోల్ కతా వేదికగా మమత చేసిన దీక్షను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ ధర్నా రాజ్యాంగ, ప్రజాస్వామ్య, ప్రజల విజయమని అన్నారు.

ఒక పోలీసు అధికారి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతోందని ప్రశ్నించారు. కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ ధర్నా స్థలానికే రాలేదని, ఈ ధర్నాలో ఆయన పాల్గొన్నట్టు కేంద్రం తప్పుడు ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆమె విమర్శలు చేశారు. మోదీని గద్దె దింపి గుజరాత్ కు పంపించడం ఖాయమని జోస్యం చెప్పారు.
Go Back to Shorts
kolkata
cm
mamata banerjee
Chandrababu
modi
cp
rajiv kumar
gujarath
pm

More Telugu News