Andhra Pradesh: ప్రతి చోట ప్యాలెస్ లు కట్టించుకున్న జగన్ వాటిలో ఉంటారా?: మంత్రి యనమల

  • దోచుకున్న సొమ్ము ఇడుపులపాయ బంకర్స్ లో ఉంది
  • దాన్ని బయటపెడితే తిరిగి ప్రజలకు పంచుతాం
  • అప్పుడేమో జైల్లో..ఇప్పుడేమో కోర్టు చుట్టూ తిరగడం

జగన్ దోచుకున్న లక్ష కోట్ల రూపాయల సొమ్మంతా ఇడుపులపాయ బంకర్స్ లో వుందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మరోసారి ఆరోపించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ దోచుకున్నది ప్రజల సొమ్ము అని, దాన్ని బయటపెడితే తిరిగి ప్రజలకే పంచుతామని అన్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో ప్యాలెస్ ను జగన్ కట్టించుకున్నారని ఆరోపించారు. ఇడుపులపాయలో, బెంగళూరులో, హైదరాబాద్ లో, అమరావతిలో.. ఇలా ప్రతి చోట ప్యాలెస్ లు కట్టించుకున్న జగన్ వాటిలో ఉంటారా? అసలు, ఆయన ఉండేదెక్కడ? గతంలో జైల్లో ఉన్నాడని, ఇప్పుడేమో, ప్రతి శుక్రవారం కోర్టు కెళుతున్నాడని సెటైర్లు విసిరారు.

More Telugu News