kejriwal: మోదీ పంపిన పోలీసులు నా బెడ్రూమ్, వంట గదుల్లోకి కూడా వచ్చారు: కేజ్రీవాల్

  • వారెంట్ లేకుండా పోలీస్ కమిషనర్ ఇంట్లోకి సీబీఐ ఎలా ప్రవేశిస్తుంది
  • నా ఇంట్లో కూడా పోలీసులతో మోదీ సోదాలు చేయించారు
  • భారత సమాఖ్య నిర్మాణాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నారు

ఎలాంటి వారెంట్ లేకుండా ఒక పోలీస్ కమిషనర్ ఇంట్లోకి సీబీఐ ఎలా ప్రవేశిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రశ్నించారు. కోల్ కతా పోలీస్ కమిషనర్ విషయంలో సీబీఐ వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. తన ఇంట్లో కూడా పోలీసులతో ప్రధాని మోదీ సోదాలు చేయించారని చెప్పారు. మోదీ పంపిన పోలీసులు ఏకంగా తన బెడ్రూమ్, వంట గదుల్లోకి కూడా వచ్చారని తెలిపారు.

భారత సమాఖ్య నిర్మాణాన్ని మోదీ ధ్వంసం చేయాలనుకుంటున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీలపై సీబీఐ, ఐటీ, ఈడీ విభాగాలను ఉసిగొలుపుతూ... ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.

More Telugu News