Andhra Pradesh: నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు వాయిదా: ఏపీపీఎస్సీ

  • గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష మార్చి 31కి వాయిదా
  • అభ్యర్థుల డిమాండ్ మేరకే ఈ నిర్ణయం 
  • దేవాదాయశాఖలో ఉద్యోగ నియామకాల పరీక్ష మే 9,10 తేదీల్లో నిర్వహణ

నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష మార్చి 10కి బదులు 31కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. గ్రూప్-1 పరీక్ష తేదీని వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగ నియామక మెయిన్స్ పరీక్షను ఏప్రిల్ 1, 2 తేదీలకు బదులు ఏప్రిల్ 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించింది. అదే విధంగా, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల ఉద్యోగాలకు ప్రాథమిక, మెయిన్స్ పరీక్ష తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయని, మార్చి 10న ప్రాథమిక పరీక్ష, మే 14, 15, 16 తేదీల్లో మెయిన్స్ పరీక్ష ఉంటుందని, అలాగే దేవాదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగ నియామకాల పరీక్ష తేదీలో మార్పు జరిగిందని మే 9, 10 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

More Telugu News