విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో పాము.. షాక్ అయిన ఉపాధ్యాయులు!

  • పౌష్టికాహారంగా ప్రతిరోజూ కిచిడీ
  • తినకపోవడంతో తప్పిన ప్రమాదం
  • విచారణకు ఆదేశించిన అధికారులు
చిన్నారి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో పాము కనిపించటం.. పెను సంచలనంగా మారింది. మహారాష్ట్రలోని నాంథేడ్‌కు దగ్గరలోని గర్గావన్ జిల్లా పరిషత్ ప్రైమరీ పాఠశాలలో 1 నుంచి 5 తరగతులకు చెందిన సుమారు 80 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి మహారాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కింద పౌష్టికాహారంగా ప్రతిరోజూ కిచిడీ అందిస్తుంది. ఈ కిచిడీని తయారు చేయించే బాధ్యతను స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించింది.

అయితే తాజాగా ఆ పాఠశాలలో విద్యార్థులకు కిచిడీ వడ్డిస్తుండగా.. అందులో ఓ పాము కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే కిచిడీని వడ్డించడం ఆపేశారు. విద్యార్థులెవరూ దానిని తినకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ఈ విషయాన్ని అక్కడి ఉపాధ్యాయులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. దీనిపై విచారణకు ఆదేశించారు. నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 
Go Back to Shorts
Kichidi
Snake
Mid day meals
Maharastra
Nanthed
Contractor

More Telugu News