gopichand: గోపీచంద్ సరసన మొదటిసారిగా తమన్నా?

  • తిరు దర్శకత్వంలో గోపీచంద్
  • రాజస్థాన్ లో ఫస్టు షెడ్యూల్ 
  • నిర్మాతగా అనిల్ సుంకర  

కొంతకాలంగా వరుస పరాజయాలతో గోపీచంద్ సతమతమైపోతున్నాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన దర్శకుడు 'తిరు'తో సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ను రాజస్థాన్ లో ప్లాన్ చేశారు. 45 రోజుల పాటు అక్కడ ఏకధాటిగా భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాలో కథానాయికగా ఎవరిని తీసుకోవాలా అనే విషయంలో కొంతమంది పేర్లను పరిశీలించారు. తమన్నా అయితే  బాగుంటుందని భావించారట. తమన్నాను సంప్రదించగా ఆమె పాజిటివ్ గా స్పందించిందని అంటున్నారు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. తమన్నా ఓకే అంటే గోపీచంద్ తో ఆమెకి ఇది తొలి సినిమా అవుతుంది. 35 కోట్ల బడ్జెట్ తో అనిల్ సుంకర నిర్మించే ఈ సినిమాకి, విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు.

More Telugu News