Smart TV: రూ. 4,999కే 32 అంగుళాల స్మార్ట్ టీవీ!

  • పేదల కోసం సామీ ఇన్ఫర్మాటిక్స్ స్మార్ట్ టీవీ
  • న్యూఢిల్లీలో ఆవిష్కరణ
  • ఇండియాలో అతితక్కువ ధర ఇదేనని వెల్లడి

సాధారణంగా 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ అంటే కనీసం 12 వేలైనా పెట్టాల్సివుంటుంది. మంచి బ్రాండ్ అయితే ఇంకా ఎక్కువే. ఈ ధర కూడా ఎక్కువని భావించే పేద తరగతి వర్గాల కోసం కేవలం రూ. 4,999కే 32 అంగుళాల స్మార్ట్ టీవీని ఢిల్లీకి చెందిన సామీ ఇన్ఫర్మాటిక్స్ అనే కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.

 న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం భారత మార్కెట్లో అతి తక్కువ ధరకు లభించే స్మార్ట్ టీవీ ఇదేనని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. దీనిలో 512 జీబీ స్టోరేజ్‌‌, 4 జీబీ ర్యామ్‌,1366×786 హెచ్డీ రిజల్యూషన్‌, 10 వాట్ స్పీకర్స్‌, (ఎస్‌ఆర్‌ఎస్‌ డాల్బీ డిజిటల్‌, 5 బ్యాండ్‌) ఇన్‌ బిల్ట్‌ వైఫై కనెక్టివీటీ, స్క్రీన్‌ మిర్రరింగ్‌ సౌకర్యాలుంటాయని, ఫేస్‌ బుక్‌, యూ ట్యూబ్‌ వంటి యాప్స్‌ ను దీని ద్వారా వినియోగించుకోవచ్చని తెలిపారు.

More Telugu News