raja singh: వ్యానును వెంబడించి 100 ఆవులను రక్షించిన ఎమ్మెల్యే రాజాసింగ్

  • ఆవులను అక్రమంగా తరలిస్తున్నారంటూ సమాచారం
  • షామీర్ పేట్ వద్ద వ్యానును అడ్డుకున్న రాజాసింగ్
  • ఆవులను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణ అసెంబ్లీలో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గోసంరక్షణ కార్యక్రమాల్లో చాలా చురుకుగా ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా కబేళాకు అక్రమంగా తరలిస్తున్న 100 ఆవులను ఆయన కాపాడారు. ఈ ఉదయం గోవులను వ్యానులో కబేళాకు అక్రమంగా తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం అందుకున్న రాజాసింగ్... క్షణం కూడా ఆలస్యం చేయకుండా వ్యానును వెంబడించారు. హైదరాబాద్ సమీపంలోని షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యానును అడ్డుకున్నారు. వ్యానుపైకి ఎక్కి ఆవులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ, ఆవులను చంపడం హిందూ ధర్మం కాదని, వాటిన రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.

More Telugu News