Puri Jagannadh: 'ఇస్మార్ట్ శంకర్' సరసన నిధి అగర్వాల్ ఖరారు

  • రామ్ తాజా చిత్రంగా ఇస్మార్ట్ శంకర్ 
  • పలువురి పేర్లు పరిశీలన 
  • చివరికి నిధి ఎంపిక

   ఇస్మార్ట్ శంకర్!
రామ్  హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ఇది. దర్శకుడు పూరీ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూలు ఇటీవలే ముగిసింది. అయితే, ఇంతవరకు హీరోయిన్ ఎవరన్నది మాత్రం ప్రకటించలేదు. అనూ ఇమ్మాన్యుయేల్, నభా నటేష్ వంటి హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం హీరోయిన్ ను ప్రకటించారు. తాజాగా 'మిస్టర్ మజ్ను' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిధి అగర్వాల్ ను ఈ చిత్రం కోసం ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది. 'నిధి అగర్వాల్ ఇస్మార్ట్ గాళ్' అంటూ క్యాప్షన్ కూడా ఇవ్వడంతో ఈ చిత్రంలో ఒకే హీరోయిన్ నటిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు.      

More Telugu News