Gujarath: ప్రియుడితో పారిపోయేందుకు యత్నించిన వివాహిత.. భర్త తరుపు బంధువుల సామూహిక అత్యాచారం!

  • యువకుడితో ప్రేమలో పడిన వివాహిత
  • ఇద్దరిపై భర్త తరుపు బంధువుల దాడి
  • ఏడుగురు కలిసి సామూహిక అత్యాచారం
  • వీడియో సోషల్ మీడియాలో వైరల్

ప్రియుడితో పారిపోవడానికి ప్రయత్నించిందంటూ ఓ వివాహితమై భర్త తరుపు బంధువులు సామూహిక అత్యాచారం చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన గుజరాత్‌లో  వెలుగు చూసింది. అహ్మదాబాద్ సమీపంలోని నానీ కరాజ్ గ్రామానికి చెందిన ఓ వివాహిత అదే గ్రామంలో ఉంటున్న యువకుడిపై ప్రేమలో పడింది. దీంతో భర్త, పిల్లలను వదిలి ఇద్దరూ ఊరు వదిలి పారిపోయేందుకు యత్నించారు.

విషయం తెలుసుకున్న భర్త తరుపు బంధువులు ఆ ఇద్దరిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి, ఆమె జుట్టును కత్తిరించారు. అయినా కోపం చల్లారక.. ఏడుగురు బంధువులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను ఫోనులో రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది బాగా వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ పోలీసులకు చేరడంతో.. అత్యాచారానికి పాల్పడిన మానిబెన్ బాబోర్, రాకేశ్ బాబోర్, రాజేశ్ బాబోర్‌, భరత్ మావి, నర్సింగ్ మావి, దినేశ్ పర్మార్, శైలేష్ బరియాలను అరెస్ట్ చేశారు.

More Telugu News