ఇస్రో ఖాతాలో మరో విజయం.. పీఎస్ఎల్వీ-సి44 ప్రయోగం విజయవంతం
- రెండు ఉప గ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ
- కలాంశాట్ను రూపొందించిన తమిళనాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు
- రక్షణ రంగ అవసరాలు తీర్చనున్న మైక్రోశాట్-ఆర్
బుధవారం రాత్రి 7.37 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ 28 గంటలపాటు నిరంతరాయంగా సాగింది. సరిగ్గా గురువారం రాత్రి 11:37 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎవరైనా ఉపగ్రహాలు తయారు చేసుకుని తీసుకొచ్చి ఇస్రో నుంచి ప్రయోగించవచ్చని తెలిపారు. కలాంశాట్ను తయారుచేసిన తమిళనాడు విద్యార్థులను ఆయన అభినందించారు.