Pawan Kalyan: రేపు జనసేన, వామపక్షాల సమావేశం.. కీలక అంశాలపై చర్చ

  • జనసేన నుంచి పవన్, మనోహర్
  • సాయిప్రియా రిసార్ట్స్‌లో సమావేశం
  • పొత్తులు, మేనిఫెస్టోపై చర్చ

రేపు వామపక్ష నేలతో జనసేన సమావేశం కానుంది. శుక్రవారం విశాఖపట్టణంలోని సాయిప్రియా రిసార్ట్స్‌లో జరగనున్న ఈ సమావేశానికి జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరు కానున్నారు. వామపక్షాల తరుపున సురవరం సుధాకర్ రెడ్డి, బీవీ రాఘవులు, రామకృష్ణ, మధు తదితరులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల పొత్తులు, ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి? మేనిఫెస్టో రూపకల్పన.. తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి.

More Telugu News