గతంలో దొంగలు బంగారాన్ని దొంగలించేవారు.. ఇప్పుడు వైసీపీ పథకాలనూ దొంగిలిస్తున్నారు!: వైసీపీ నేత ఉమ్మారెడ్డి సెటైర్
- కాపులను చంద్రబాబు మోసం చేస్తున్నారు
- సగం రిజర్వేషన్ ఇచ్చే అధికారం సీఎంకు లేదు
- కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం
గతంలో దొంగలు బంగారం, నగదును దోచుకునేవారనీ, ఇప్పుడు మాత్రం నవరత్నాల పథకాలను దొంగలించేవారు తయారయ్యారని విమర్శలు గుప్పించారు. జగన్ ప్రకటించిన రూ.2 వేల పెన్షన్ పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారని వ్యాఖ్యానించారు. జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ విచారణ అనగానే ఏపీ ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతపై దాడి వెనుక ఏపీ ప్రభుత్వం కుట్ర ఉందని ఆరోపించారు.