kiara adwani: కైరా అద్వాని బాగా అప్సెట్ అయిందట

  • తొలి సినిమాతో హిట్ 
  • రెండవ సినిమాతో అప్సెట్ 
  • సెట్స్ పై 'అర్జున్ రెడ్డి' రీమేక్    

'భరత్ అనే నేను' సినిమాతో కైరా అద్వాని తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైంది. తొలి సినిమాతోనే మహేశ్ జోడీగా ఛాన్స్ దొరకడం .. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె ఎంతో అదృష్టవంతురాలు అనుకున్నారు. ఆ తరువాత ఆమెకి  చరణ్ సరసన అవకాశం రావడంతో, టాలీవుడ్లో ఆమె జోరు కొనసాగడం ఖాయమని చెప్పుకున్నారు.

'వినయ విధేయ రామ' కూడా హిట్ అయితే తెలుగులో వరుస అవకాశాలు వస్తాయనీ .. అగ్ర కథానాయికల జాబితాలో చేరిపోతానని కైరా అద్వాని ఆశించింది. నిజంగానే ఈ సినిమా హిట్ కొట్టేసి వుంటే ఆమె డిమాండ్ అమాంతంగా పెరిగిపోయేదే. కానీ అలా జరగలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పరాజయం పాలైంది. ఈ సినిమాపై తాను పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారి పోవడంతో కైరా అద్వాని బాగా అప్సెట్ అయిందట. అందుకే, తెలుగులో చేయబోయే తదుపరి సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. హిందీలో ఆమె 'అర్జున్ రెడ్డి' రీమేక్ లో చేస్తోన్న సంగతి తెలిసిందే. 

More Telugu News