పలాస ఎమ్మెల్యే శివాజీపై జగన్ తీవ్ర ఆరోపణలు.. కోర్టుకెక్కేందుకు సిద్ధమైన టీడీపీ ఎమ్మెల్యే
- పలాస బహిరంగ సభలో శివాజీపై జగన్ తీవ్ర ఆరోపణలు
- తీవ్రంగా పరిగణించిన శివాజీ
- త్వరలోనే లీగల్ నోటీసులు పంపాలని నిర్ణయం
శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర సమయంలో పలుచోట్ల నిర్వహించిన బహిరంగ సభల్లో జగన్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపైనా, స్థానిక టీడీపీ నేతలపైనా పలు ఆరోపణలు చేశారు. పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో గౌతు శ్యామ సుందర శివాజీపైనా విరుచుకుపడ్డారు. జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన శివాజీ ఆయనకు లీగల్ నోటీసులు పంపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.