Andhra Pradesh: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!

  • ఒత్తిడి కారణంగా పేలిపోయిన బ్లోపైప్
  • కాలిపోయిన ఐదు బైక్ లు
  • మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

ఏపీలోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఈరోజు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ లోని బ్లాస్ట్ ఫర్నెస్-3లోని బ్లోపైప్ ఒత్తిడి కారణంగా పేలిపోయింది. దీంతో భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సమీపంలో పార్క్ చేసిన ఐదు బైక్ లు పూర్తిగా కాలిపోయాయి.

వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ విషయమై ప్లాంట్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. బ్లోపైప్ పేలిపోవడంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందనీ, ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల భారీగా నష్టం సంభవించిందని వ్యాఖ్యానించారు.

More Telugu News