modi: ముగ్గురు మోదీలతో మనం పోరాడాలి: సీఎం చంద్రబాబు

  • కేంద్రంపై విరుచుకుపడ్డ చంద్రబాబు 
  • మోదీ, కేసీఆర్, జగన్ లపై నిప్పులు చెరిగిన బాబు
  • ప్రజలు బాగుపడటం వైసీపీకి ఇష్టం లేదు

ఏపీపై కేంద్రం తీరుపై సీఎం చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధికి ముగ్గురు మోదీలు అడ్డుపడుతున్నారంటూ మోదీ, కేసీఆర్, జగన్ లపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఈ ముగ్గురు మోదీలతో మనం పోరాడాలని పిలుపు నిచ్చారు. ప్రజలు బాగుపడటం వైసీపీకి ఇష్టం లేదని, కడుపు మంటతో ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొందరు ఏపీపై ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు.

More Telugu News