petrol: వరుసగా మూడో రోజు కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

  • లీటర్ పెట్రోల్ 19 పైసలు, డీజిల్ ధర 29 పైసలు పెరిగిన వైనం
  • హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 73.41
  • లీటర్ డీజిల్ ధర రూ. 68.57  

ఇటీవల కాలంలో క్రమంగా తగ్గుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు గత మూడు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు కూడా లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు, లీటర్ డీజిల్ ధర 29 పైసలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 69కు, డీజిల్ ధర రూ. 63.10కు పెరిగింది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 75, డీజిల్ ధర రూ. 66కు చేరుకుంది. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 73.41కి, డీజిల్ ధర రూ. 68.57కి పెరిగాయి.    

More Telugu News