Telangana: మంచు ఎఫెక్ట్.. తెలంగాణలో రహదారి కనిపించక ఢీకొట్టుకున్న 50 వాహనాలు!

  • షాద్ నగర్-కొత్తూరు రహదారిపై ఘటన
  • భారీగా స్తంభించిన ట్రాఫిక్
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు

తెలంగాణలో దట్టంగా కురుస్తున్న మంచుతో చాలాచోట్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా హైదరాబాద్ సమీపంలోని షాద్ నగర్-కొత్తూరు రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంచు కారణంగా రహదారి కనిపించకపోవడంతో పలు వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 50కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదం నేపథ్యంలో ఈ మార్గంలో కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. కాగా, ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

More Telugu News