KTR: రూ.కోటితో వృద్ధాశ్రమాన్ని కట్టి ప్రభుత్వానికి ఇచ్చిన జంట.. ప్రశంసించిన కేటీఆర్!

  • సత్యనారాయణ, జానకమ్మ దంపతుల వితరణ
  • ఆశ్రమం నిర్వహణ ప్రభుత్వానికి అప్పగింత
  • ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ నేత

సొంత నిధులతో వృద్ధాశ్రమాన్ని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించిన ఓ జంటను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. చౌటుప్పల్ శ్రీ సత్యనారాయణ రెడ్డి, జానకమ్మ రూ.కోటి వ్యయంతో వృద్ధాశ్రమాన్ని నిర్మించారని కేటీఆర్ తెలిపారు.

అనంతరం ఈ ఆశ్రమం నిర్వహణను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించారని పేర్కొన్నారు. ఈ జంట చేసిన సాయం తన మనసును కదిలించివేసిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. సత్యనారాయణ రెడ్డి, జానకమ్మలతో దిగిన ఫొటోను మంత్రి తన ట్వీట్ కు జత చేశారు.

More Telugu News