YSRCP: తిరుమల శ్రీవారి దర్శనం.. పట్టువస్త్రాలు ధరించిన జగన్

  • వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి బయలుదేరిన జగన్
  • సాధారణ దర్శనంలో వెళ్లిన వైసీపీ అధినేత
  • జగన్ వెంట వైసీపీ నాయకులు

అలిపిరిలోని మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. అనంతరం, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఆయన బయలుదేరారు. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తులు పట్టు వస్త్రాలను జగన్ ధరించారు. సాధారణ భక్తుడిలా స్వామి వారిని దర్శించుకోనున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. కాగా, జగన్ వెంట వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

More Telugu News