Andhra Pradesh: రేపటితో ముగియనున్న ప్రజాసంకల్ప యాత్ర.. వీడియో ఆల్బమ్ ను ఆవిష్కరించిన జగన్!

  • ఇచ్ఛాపురంలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత
  • పాదయాత్ర విశేషాలతో వీడియో 
  • రూపొందించిన యలమంచిలి రవి

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇచ్ఛాపురంలో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ‘జగనన్నకు తోడుగా’ ఆడియో ఆల్బమ్ ను జగన్ ఈరోజు ఉదయం ఆవిష్కరించారు. ప్రజాసంకల్ప యాత్ర పూర్తి విశేషాలతో కూడిన ఈ వీడియో సీడీని జగన్ విడుదల చేశారు. వైసీపీ విజయవాడ తూర్పునియోజకవర్గ సమన్వయకర్త యలమంచిలి రవి ఈ వీడియోను రూపొందించారు.

More Telugu News