మేమే చస్తున్నాం... 20 రోజుల ముందు వచ్చి థియేటర్లంటే ఎలా?: 'పేట' నిర్మాతపై దిల్ రాజు ఫైర్

షార్ట్స్‌లో చూడండి
రజనీకాంత్ తాజా చిత్రం 'పేట'కు థియేటర్లు ఇవ్వడం లేదని చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. వారు తొందరపడి స్టేట్ మెంట్ ఇచ్చారేమో తనకు తెలియదని, ఇప్పుడు విడుదలవుతున్న 3 సినిమాలూ 6 నెలల క్రితమే రిలీజ్ ను ఖరారు చేసుకున్నాయని అన్నారు. వీటికే థియేటర్లు ఎలా సర్దుకోవాలన్న విషయమై ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు.

వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటించిన మల్టీస్టారర్ 'ఎఫ్2' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పక్క రాష్ట్రం నుంచి 20 రోజుల ముందు సినిమాను కొనుక్కుని వచ్చి సంక్రాంతికి విడుదల చేయాలంటే ఎలాగని ప్రశ్నించారు. థియేటర్లు ఎలా అడ్జస్ట్ చేయగలమని విమర్శించారు. డబ్బింగ్ సినిమా 'సర్కార్', 'నవాబ్' వంటి సినిమాలను ఎన్ని థియేటర్స్ లో కావాలంటే అన్ని థియేటర్లలో వేసుకున్నారని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు దొరకడం లేదని అంటున్నారని అన్నారు.
Go Back to Shorts
Dil Raju
Peta
Theaters

More Telugu News