Andhra Pradesh: ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ!

  • ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించడంపై హర్షం
  • ప్రజలకు మరింత చేరువవుతామని వ్యాఖ్య
  • ఆరోగ్యకరమైన చర్చ కోరుకుంటున్నట్లు వెల్లడి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ట్విట్టర్ లో ఖాతాను ప్రారంభించారు. ఈ విషయాన్ని స్వయంగా బొత్స వెల్లడించారు.

ఈరోజు ఉదయం తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందిస్తూ.. ‘ట్విట్టర్ అకౌంట్ ను ప్రారంభించడం, మీ అందరితోనూ అభిప్రాయాలను పంచుకునే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ప్రజలకు మరింత చేరువయ్యే విషయంలో.. ఈ వేదికపై జరిగే ఆరోగ్యకరమైన చర్చ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీ అందరి ఆదరణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.

More Telugu News