KA Paul: ఒక్కొక్కరూ వంద, వెయ్యిమందికి చెప్పి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి: కేఏ పాల్

  • అధికారంలోకి వస్తే నిధుల వరద పారిస్తాం
  • బిజినెస్ కాన్ఫరెన్సులు పెడతా
  • పెట్టుబడులు, డొనేషన్లు రాబడతా

నిరుద్యోగులు, మహిళలు ఒక్కొక్కరూ వంద, వెయ్యిమందికి చెప్పి ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బోలెడు నిధులు తెస్తానన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తాను 200 దేశాల నుంచి 2045 మందితో బిజినెస్ కాన్ఫరెన్సులు పెట్టానని.. ఇప్పుడు కూడా అలాగే పెట్టి పెట్టుబడులు, డొనేషన్లు రాబడతానన్నారు. ఆ వచ్చిన డబ్బుతో రుణాలను తీర్చేస్తానని కేఏ పాల్ తెలిపారు. ఏడు లక్షల కోట్లు తెచ్చి.. రెండు లక్షల కోట్లతో రుణమాఫీ చేస్తానని.. మిగిలిన ఐదు లక్షల కోట్లతో ఐదేళ్లకు బడ్జెట్ కేటాయింపులు జరుపుతామన్నారు.  

More Telugu News