రాజకీయాల్లోకి రాబోతున్నా.. టీడీపీలో నేను చేరితే తప్పేంటి?: నటుడు శివాజీ
- ఏపీ ప్రజల కోసమే నేను పోరాడుతున్నా
- నాకు టీడీపీలో చేరే హక్కు ఉంది
- చంద్రబాబుపై కుట్రలు జరుగుతున్నాయి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కుట్రలు జరుగుతున్నాయని శివాజీ పునరుద్ఘాటించారు. తాను ఏపీ ప్రజల కోసం పోరాడుతున్నాననీ, టీడీపీ ప్రభుత్వం కోసం పనిచేయడం లేదని స్పష్టం చేశారు. తనకు అసెంబ్లీలో అధ్యక్షా! అనే హక్కులేదా? అని ప్రశ్నించారు. ఏపీలో ప్రతిపక్షం తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించడం లేదన్నారు. ఏపీలో బీజేపీ ‘ఆపరేషన్ గరుడ’ అమలు చేయబోతోందని ఆమధ్య శివాజీ చెప్పి, సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.