Cricket: ఆస్ట్రేలియాతో చివరి టెస్టుకు భారత జట్టు ఇదే

  • రేపు సిడ్నీ వేదికగా నాలుగో టెస్ట్ 
  • 2-1 ఆధిక్యంలో భారత్ 
  • 13 మంది ఆటగాళ్ల జాబితాని ప్రకటించిన బీసీసీఐ

భారత్ - ఆసీస్ జట్ల మధ్య రేపు సిడ్నీ వేదికగా చివరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా 13 మంది ఆటగాళ్ల జాబితాని ప్రకటించింది. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత జట్టు ఇప్పటికే 2-1 ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఎలాగైనా ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ని కైవసం చేసుకోవాలని టీంఇండియా భావిస్తోంది.

భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రహానే, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, జడేజా, కే యాదవ్, అశ్విన్, షమీ, బుమ్రా, ఉమేష్ యాదవ్


More Telugu News