రూ.19,567 కోట్లు.. బ్యాంకుల్లో మూలుగుతున్న ఈ సొమ్ము ఎవరిదీ కాదట!
- గతేడాదితో పోలిస్తే ఇది 33 శాతం ఎక్కువ
- డీఈఏకు బదిలీ కానున్న సొమ్ము
- గడువులోపు రీ క్లెయిమ్ చేసుకునే అవకాశం
ఈ సొమ్మును భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కి చెందిన డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ) ఫండ్కు బదిలీ చేయనున్నారు. గత పదేళ్లుగా ఎవరూ నిర్వహించకుండా ఉన్న బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లను డీఈఏ చూసుకుంటుంది. ఒకసారి ఈ క్లెయిములు సెటిల్ అయ్యాక ఈ సొమ్మును ఆర్థిక అవగాహనను మెరుగుపరిచేందుకు ఉపయోగిస్తుంది. ఈ సొమ్మును డీఈఏ ఫండ్కు బదిలీ చేసినప్పటికీ తమ సొమ్మును వెనక్కి తీసుకునే వెసులుబాటు ఖాతాదారులకు ఉంటుంది. అయితే, గడువులోపు అందకు సంబంధించిన విధివిధానాలను పూర్తిచేయాల్సి ఉంటుంది.