Bandla Ganesh: బండ్ల గణేశ్ కు పీక కోసుకునేంత సీన్ లేదని మాకు ముందే తెలుసు: నాగబాబు

  • గణేశ్ ఇంటర్వ్యూ చూడాలనిపిస్తుంది
  • రియల్ లైఫ్‌లో కామెడీ చేస్తున్నాడు
  • వంద అంటామండీ అని అంటాడని తెలుసు

కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేశ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పార్టీ అధికారంలోకి రాకుంటే 7ఓ క్లాక్ బ్లేడ్‌తో పీక కోసుకుంటానంటూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కామెంట్స్‌పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బండ్ల గణేశ్ తన పార్టీపై నమ్మకంతో కాస్త ఎక్కువ మాట్లాడాడు.. తప్పులేదు. కానీ గణేశ్ ఏంటి, ఇలా మాట్లాడుతున్నాడు? ఎంత నమ్మకముంది ఇతనికి? వీడిది మేకపోతు గాంభీర్యమేనని నాకెక్కడో డౌట్. ఎందుకంటే, పెద్ద మెజారిటీతో గెలవకపోవచ్చు కానీ, మ్యాజిక్ ఫిగర్‌తో మాత్రం టీఆర్ఎస్ గెలుస్తుందన్న నమ్మకం నాకుంది.

మా పిల్లలం, మేమంతా టీఆర్ఎస్‌కి ఓటేశాం. గణేశ్ ఇంటర్వ్యూ నాకు చూడలనిపిస్తుంటుంది. ఎందుకంటే అతను బాగా నవ్విస్తాడు. గణేశ్ ఆ ఫన్‌ని సినిమాల్లో పెట్టుంటే చాలా పెద్ద కమెడియన్ అయ్యుండేవాడు. సినిమాల్లో చూపించకుండా రియల్ లైఫ్‌లో కామెడీ చూపిస్తున్నాడు. ఓడిపోతే ఏం చేస్తాడు? నిజంగా పీక కోసుకుంటాడా? అయితే గణేశ్ గాడికి పీక కోసుకునేంత సీన్ లేదని మాకు ముందే తెలుసు.

‘వంద అంటామండీ’ అని అంటాడని కూడా తెలుసు. చివరికి అదే అన్నాడు. ఎన్నికల సమయంలో ఓవైపు రేవంత్ రెడ్డి ఆవేశపూరిత ప్రసంగాలు.. మరోవైపు టీఆర్ఎస్ ప్రసంగాల మధ్య గణేశ్ గాడి మాటలు మాత్రమే ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండేవి. ఆ విషయంలో మాత్రం వాడిని మెచ్చుకోవాలి’’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. 

More Telugu News