balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ కి పనిచేయడం నా అదృష్టం: రచయిత బుర్రా సాయిమాధవ్

  • ఎన్టీఆర్ మహానుభావుడు 
  •  బాలకృష్ణగారికి డైలాగ్స్ రాయడం అదృష్టం
  • బాలకృష్ణగారు మాత్రమే న్యాయం చేయగలరు       

నందమూరి అభిమానులంతా ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగమైన 'కథానాయకుడు' జనవరి 9వ తేదీన .. రెండవభాగమైన 'మహానాయకుడు' ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాలకి సంభాషణల రచయితగా బుర్రా సాయిమాధవ్ పనిచేశారు.

తాజాగా ఆయన ఈ బయోపిక్ ను గురించి ప్రస్తావిస్తూ .. "ఎన్టీఆర్ బయోపిక్ లో ఉన్నది ఉన్నట్టుగా తీయడానికి .. నిజాలు చెప్పడానికి మా వంతు కృషి చేశాము. ఎవరినీ కించపరిచే ఉద్దేశం మీకు ఎక్కడా కనిపించదు .. అందరినీ గౌరవించేలానే ఈ కథ కొనసాగుతుంది. ప్రతి పాత్రకు సంబంధించిన సంభాషణలను ఎంతో ఆనందిస్తూ.. ఆస్వాదిస్తూ రాశాను. ఎన్టీఆర్ గారికి ఎంత గొప్ప చరిత్ర వుందో .. అంతే గొప్పగా ఈ సినిమా మేకింగ్ ఉంటుంది. ఎన్టీఆర్ వంటి మహానుభావుడి చరిత్రకు సంబంధించిన సినిమాకు పనిచేయడం .. బాలకృష్ణగారికి మాటలు రాయడం నా అదృష్టం. ఎన్టీఆర్ పాత్రకి బాలకృష్ణ మినహా మరెవరూ న్యాయం చేయలేరు" అని ఆయన అన్నారు. 

More Telugu News