Tollywood: హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న మహేశ్ బాబు కుటుంబం!

  • విదేశాల్లో పర్యటిస్తున్న మహేశ్ బాబు కుటుంబం
  • ఓ ఫొటో పోస్ట్ చేసిన నమ్రతా శిరోద్కర్
  • ఈ ఫొటోలో మహేశ్, నమ్రతా తదితరులు

ఎగవేసిన జీఎస్టీ పన్ను బకాయిలు తక్షణం చెల్లించాలంటూ హీరో మహేశ్ బాబుకు నోటీసులు జారీ అయిన విషయం హాట్ టాపిక్ గా మారింది. మహేశ్ బ్యాంకు అకౌంట్స్ ని కూడా అటాచ్ చేశారు. ఈ నోటీసులపై మహేశ్ బాబు లీగల్ టీమ్ తాజాగా స్పందించడం తెలిసిందే. అయితే, ప్రస్తుతం మహేశ్ బాబు ఎక్కడున్నాడన్న విషయమై ఆయన అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పోస్ట్ చేసిన ఓ ఫొటో ద్వారా ప్రస్తుతం వారు హాలిడే ట్రిప్ లో ఉన్నట్టు అర్థమవుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు మహేశ్ బాబు కుటుంబం వెళ్లినట్టు సమాచారం. 

More Telugu News