Andhra Pradesh: ఒంగోలులో అనుమానాస్పద స్థితిలో మంటల్లో సజీవదహనమైన బాలుడు!

  • అర్ధరాత్రి మంటల్లో చిక్కుకున్న బాలుడు
  • హాహాకారాలు చేస్తూ కన్నుమూత
  • కేసు నమోదుచేసిన పోలీసులు

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. నిన్న అర్ధరాత్రి సమయంలో ఇక్కడి శ్రీ ప్రతిభ జూనియర్ కళాశాల సమీపంలో ఓ బాలుడు (16) మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేశాడు. అతడిని గుర్తించిన అక్కడి వాచ్ మెన్ మంటలను ఆర్పేందుకు యత్నించాడు. అయితే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో ఆ బాలుడు ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు.

కాగా, వాచ్ మెన్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని రిమ్స్ కు తరలించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. అర్ధరాత్రి బాలుడు అక్కడికి ఎలా వచ్చాడు? ఎవరైనా అతనిపై హత్యాయత్నం చేశారా? లేక అతనే ఆత్మహత్య చేసుకున్నాడా? అసలు ఈ బాలుడు ఎక్కడ ఉంటాడు? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

More Telugu News