Andhra Pradesh: నిన్న ధర్మపోరాట దీక్ష సందర్భంగా చంద్రబాబు హెలిప్యాడ్ వద్ద నాటు బాంబు.. పోలీసుల టెన్షన్!

  • తొలుత గుర్తించిన స్థానికులు
  • పందులను బెదరగొట్టేందుకు వాడేదిగా గుర్తింపు
  • స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురంలో నిన్న నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రాక కోసం ఇక్కడి శిల్పారామంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ నాటు బాంబు తరహాలో తాళ్లతో చుట్టిన ఓ ఉండ పోలీసులను టెన్షన్ కు గురిచేసింది.

దీన్ని తొలుత హెలిప్యాడ్ సమీపంలో గుర్తించిన స్థానికులు అక్కడి నుంచి దూరంగా పారిపోయారు. ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న పోలీసులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది తోటలో పంటలను నాశనం చేయకుండా పందులను బెదరగొట్టేందుకు వాడే నాటు బాంబు అయ్యుండొచ్చని తెలుస్తోంది. కాగా, పోలీసుల నిఘా పటిష్టంగా ఉన్నప్పటికీ ఏకంగా  ముఖ్యమంత్రి హెలిప్యాడ్ వద్దే ఈ వస్తువు కనిపించడంతో కలకలం రేగింది. 

More Telugu News