'ఉక్కు' సంకల్పం.. నేడు గడ్డం తీయనున్న సీఎం రమేశ్!
- కడప ఉక్కు కోసం గతంలో రమేశ్ నిరాహార దీక్ష
- పునాది రాయి పడే వరకు గడ్డం తీయబోనని ప్రతిన
- నేడు తిరుమలలో దీక్ష విరమణ
విభజన చట్టంలో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గురించి పేర్కొన్నప్పటికీ కేంద్రం ఆ విషయంలో ముందుకు రాకపోవడంతో పార్టీలకు అతీతంగా ఆందోళనలు జరిగాయి. కేంద్రానికి వ్యతిరేకంగా వివిధ పార్టీల నేతలు ఆందోళనలు చేపట్టారు. కడపలో ఉక్కుపరిశ్రమ నిర్మించాలంటూ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ సందర్భంగా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు పునాది రాయిపడే వరకు గడ్డం తీయనని దీక్ష పూనారు. నేడు సీఎం చంద్రబాబు పునాది రాయి వేయనుండడంతో రమేశ్ తన దీక్షను విరమించనున్నారు.