India: ఐదుగురితో వివాహం.. మరో 21 మంది యువతుల ట్రాప్.. మోసగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు!

  • యువతులను మోసం చేస్తున్న అభిషేక్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి
  • కటకటాల వెనక్కునెట్టిన పోలీసులు 

అప్పటికే ఐదుగురిని పెళ్లి చేసుకున్న ఓ మోసగాడు, మరో 21 మంది యువతులను వివాహం చేసుకుంటానని ట్రాప్ చేశాడు. అయితే ఇతని చేతిలో మోసపోయిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

హరియాణాకు చెందిన అభిషేక్ వశిష్ట్ ఉరఫ్ అభినవ్ అభిరుద్రాంశ్‌ ప్రధానంగా విడాకులు తీసుకున్న యువతులను టార్గెట్ చేస్తుంటాడు. పెళ్లి వెబ్ సైట్లలో తనను తాను ఓ మీడియా సంస్థ యజమానిగా పరిచయం చేసుకుంటాడు. తియ్యటి మాటలు కలుపుతూ పెళ్లి చేసుకుందామని లొంగదీసుకుంటాడు. చివరికి తన కోరిక తీరగానే అడ్రస్ లేకుండా పారిపోతాడు.

ఇలా ఈ ప్రబద్ధుడు ఇప్పటివరకూ ఐదుగురిని వివాహం చేసుకుని మోసం చేశాడు. మరో 21 మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు. అయితే ఇతని బారినపడ్డ ఓ యువతి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అభిషేక్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు హరిద్వార్ లో అతడిని పట్టుకున్నారు. అనంతరం కోర్టు ముందు హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు.

More Telugu News