Guntur District: గుంటూరు జిల్లాలో నాటుబాంబుల కలకలం.. వైసీపీ నేత ఇంటి ముందు స్వాధీనం!

  • రెంటచింతల మండలం మంచికల్లులో ఘటన
  • పోలేరమ్మ జాతర సందర్భంగా అధికారుల తనిఖీలు
  • నిందితుడిని ప్రశ్నిస్తున్న పోలీసులు

గుంటూరు జిల్లాలో ఈరోజు నాటు బాంబుల కలకలం చెలరేగింది. జిల్లాలోని రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో త్వరలోనే పోలేరమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఊరిలోని వైసీపీ నేత యరపతినేని నరసింహరావు ఇంటి ముందు పార్క్ చేసిన కారు కింద ఓ బకెట్ లో 15 నాటు బాంబులను గుర్తించారు.

వెంటనే అప్రమత్తమయిన అధికారులు బాంబు స్క్వాడ్ ను రంగంలోకి దించారు. దీంతో బాంబు స్వ్కాడ్ సిబ్బంది నాటు బాంబులను నిర్వీర్యం చేశారు. ఈ నేపథ్యంలో కారు ఓనర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నాటుబాంబుల వ్యవహారంపై ప్రశ్నిస్తున్నారు.

More Telugu News