sharwanand: సుధీర్ వర్మతో సినిమా గురించి శర్వానంద్

  • సుధీర్ వర్మతో శర్వానంద్ 
  • 50 శాతం చిత్రీకరణ పూర్తి 
  • మరో షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి    

 శర్వానంద్ తాజా చిత్రంగా రూపొందిన 'పడి పడి లేచె మనసు' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ఆ తరువాత సినిమాను శర్వానంద్ 50 శాతం వరకూ పూర్తిచేసేశాడు. ఆయన తదుపరి చిత్రం సుధీర్ వర్మ దర్శకత్వంలో నిర్మితమవుతోంది. తాజాగా ఈ సినిమాను గురించి శర్వానంద్ ప్రస్తావించాడు.

"ఈ సినిమాలో నేను ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది .. అందులో నిజం లేదు. ఒకే పాత్రలో రెండు డిఫరెంట్ షేడ్స్ మాత్రం ఉంటాయి. నేను గ్యాంగ్ స్టర్ గా కనిపించే ఈ సినిమా ప్రెజెంట్ .. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో కొనసాగుతుంది. ప్రెజెంట్ ఎపిసోడ్స్ లో వయసు మళ్లిన డాన్ గా కనిపిస్తాను. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. మరో లాంగ్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది" అని ఆయన చెప్పాడు. ఈ సినిమాలో శర్వానంద్ జోడీగా కల్యాణి ప్రియదర్శన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.   

More Telugu News