Chandrababu: చంద్రబాబును చూసి తెలంగాణ కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు: జీవీఎల్

  • తెలంగాణలో బీజేపీ ఓటు శాతం పెరిగింది
  • రాష్ట్రాల శ్రేయస్సు కోసం బీజేపీ కృషి చేస్తోంది
  • ఏపీలో ఎమ్మెల్యేలకు ముడుపులిస్తేనే పనులు జరుగుతాయి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రజాకూటమి పేరిట కాంగ్రెస్, టీడీపీలతో ఇతర పార్టీలు జతకట్టి ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ సెటైర్లు విసిరారు. చంద్రబాబును చూసి తెలంగాణ కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని ఆరోపించారు. టీడీపీని వదిలిన తర్వాత తెలంగాణలో బీజేపీ ఓటు శాతం పెరిగిందని, అన్ని రాష్ట్రాల శ్రేయస్సు కోసం బీజేపీ కృషి చేస్తోందని చెప్పారు.

ఏపీకి కేంద్రం ఇచ్చిన విపత్తు నిధులు ఏం చేశారు?

ఏపీకి కేంద్రం భారీగా విపత్తుల సాయం చేస్తోందని, ప్రజా శ్రేయస్సు కోసం నిబంధనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు. రూ.559 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులను ఏపీకి కేంద్రం ఇచ్చిందని, ఈ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని పథకాలలో ఈ నిధులను వినియోగించి దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఏపీలో ఎమ్మెల్యేలకు ముడుపులిస్తేనే పనులు జరుగుతున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More Telugu News