విశాల్ కు వ్యతిరేకంగా 50 మంది నిర్మాతల నిరసన!
- తమిళనాడులో శుక్రవారం విడుదల కానున్న 9 సినిమాలు
- చిన్న చిత్రాలకు అన్యాయం జరుగుతుందంటూ ఆందోళన
- కార్యాలయానికి తాళం వేసి.. పోలీస్ స్టేషన్ లో అప్పగింత
రానున్న శుక్రవారం తమిళనాడులో ఏకంగా 9 సినిమాలు విడుదల కానున్నాయి. ఇన్ని సినిమాలు ఒకే రోజు విడుదలైతే... చిన్న చిత్రాల పరిస్థితి ఏమిటని విశాల్ వ్యతిరేక వర్గం ఆందోళనకు దిగింది. నిర్మాతల సంఘం కార్యాలయం ఎదుట దాదాపు 50 మంది నిర్మాతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమయంలో విశాల్ అక్కడ లేకపోవడంతో... కౌన్సిల్ సెక్రటరీ కదిరేశన్ తో వాగ్వాదానికి దిగారు. విశాల్ కు సన్నిహితులైన ఉదయ, ఆర్కే సురేష్ లు కూడా ఇప్పుడు వ్యతిరేక వర్గంలో చేరడం కొసమెరుపు.