karunanidhi: కరుణానిధి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా.. హాజరైన చంద్రబాబు

  • చెన్నైలో కరుణ విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా
  • హాజరైన రాహుల్, చంద్రబాబు, పినరయి విజయన్, నారాయణస్వామి, రజనీకాంత్
  • కార్యక్రమానికి ముందు కరుణకు ఘన నివాళి అర్పించిన నేతలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం చెన్నైలో అట్టహాసంగా జరిగింది. యూపీఏ ఛైర్మన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కరుణ విగ్రహాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా సోనియా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పుదుచ్చేరి సీఎం వి.నారాయణస్వామిలు కూడా హాజరయ్యారు.

ఆహూతులతో కలసి సూపర్ స్టార్ రజనీకాంత్, బీజేపీ ఎంపీ శత్రుఘన్ సిన్హాలు కూడా కూర్చోవడం గమనార్హం. ఈ కార్యక్రమంతో తమిళనాడులో స్టాలిన్ తన బలాన్ని మరోసారి ప్రదర్శించారు. అంతేకాక, జాతీయ స్థాయిలో ఏర్పడనున్న మహాకూటమికి ఈ కార్యక్రమం మరింత బలాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమానికి ముందు నేతలంతా కరుణ సమాధి వద్ద ఆయనకు ఘన నివాళి అర్పించారు.

More Telugu News