supreme court: సుప్రీంకోర్టును కేంద్రం తప్పుదోవ పట్టించింది.. తీర్పును వెనక్కి తీసుకోవాలి: కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ

  • రాఫెల్ కేసులో సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించింది
  • వారికి అనుకూలంగా వచ్చేలా చూసుకుంది
  • ఆంగ్ల భాషను సుప్రీం సరిగా అర్థం చేసుకోలేకపోయిందని చెబుతోంది

రాఫెల్ యుద్ధ విమానాల డీల్ కేసులో సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ ఆరోపించారు. సుప్రీంను తప్పుదోవ పట్టించి, తీర్పు కేంద్రానికి అనుకూలంగా వచ్చేలా చూసుకుందని మండిపడ్డారు. తీర్పులో పొరపాట్లు దొర్లే సరికి... ఆంగ్ల భాషను సుప్రీంకోర్టు సరిగా అర్థం చేసుకోలేదని ప్రభుత్వం చెబుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో, తామిచ్చిన తీర్పు చెల్లదంటూ, సుప్రీంకోర్టు తన తీర్పును వెనక్కి తీసుకోవాలని కోరారు. 

More Telugu News